గుంటూరులో అర్థరాత్రి యువకుల వీరంగం
ABN , First Publish Date - 2022-02-10T23:46:15+05:30 IST
పెట్రోల్ బంకులో అర్థరాత్రి నలుగురు యువకులు వీరంగం
గుంటూరు: పెట్రోల్ బంకులో అర్థరాత్రి నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. నరసరావుపేట మండలo జొన్నలగడ్డ దగ్గర పెట్రోల్ బంకులో ఆ ఘటన జరిగింది. సేల్స్మెన్పై విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డొచ్చిన మరో అతనిపై యువకులు దాడికి పాల్పడ్డారు. దాడి తర్వాత సెల్ఫోన్, రూ.10 వేలు నగదును యువకులు లాక్కెళ్లారు. యువకులు గంజాయి మత్తులో ఉన్నారని సేల్స్మెన్లు ఆరోపిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.