-
-
Home » Prathyekam » Youth reached the police station and told that he killed to persons sgr spl-MRGS-Prathyekam
-
చేతులకు రక్తంతో పోలీస్ స్టేషన్కు చేరుకున్న యువకుడు.. అతడు చెప్పింది విని పరుగులు పెట్టిన పోలీసులు..!
ABN , First Publish Date - 2022-05-05T22:40:17+05:30 IST
జైపూర్లో ఓ యువకుడు కొంత కాలంగా ప్రేమ అంటూ ఓ బాలిక వెంట పడుతున్నాడు..
జైపూర్లో ఓ యువకుడు కొంత కాలంగా ప్రేమ అంటూ ఓ బాలిక వెంట పడుతున్నాడు.. ఆమెకు ఇష్టం లేకపోవడంతో ఆ యువకుడిని తిరస్కరించింది.. దీంతో బాలికపై తీవ్ర ద్వేషం పెంచుకున్న యువకుడు నేరుగా ఆమె ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డాడు.. నిద్రిస్తున్న బాలికను కత్తితో పొడిచి చంపేశాడు.. అడ్డు వచ్చిన ఆమె అన్నను కూడా చంపేశాడు.. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకుని అసలు విషయం చెప్పి లొంగిపోయాడు.
రాజస్థాన్లోని జైపూర్కు సమీపంలోని హసన్పురాకు చెందిన గుల్షన్ అనే వ్యక్తి తన ఇంటి పక్కనే ఉండే 16 ఏళ్ల బాలికను ప్రేమించాడు. అయితే వయసు అంతరం బాగా ఉండడంతో గుల్షన్ పట్ల ఆ బాలిక ఆసక్తి చూపించలేదు. గుల్షన్ ఎంతలా వెంట పడుతున్నా పట్టించుకోలేదు. ఆ బాలిక తిరస్కరిస్తున్నా గుల్షన్ మాత్రం పెళ్లి కోసం పట్టుబట్టాడు. పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ బాలిక అందుకు అంగీకరించకపోవడంతో ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు.
బుధవారం ఉదయం ఆ బాలిక ఇంట్లో నిద్రిస్తూ ఉండగా గుల్షన్ లోపలికి వెళ్లాడు. కత్తితో ఆ బాలిక గొంతు కోసేశాడు. చెల్లి అరుపులు విన్న సోదరుడు సోను (19) గుల్షన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో సోనూను కూడా గుల్షన్ కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తాను రెండు హత్యలు చేశానని చెప్పి లొంగిపోయాడు. షాకైన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టమ్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.