నిర్మానుష్య ప్రాంతంలో తీవ్ర దుర్వాసన.. భూమిలోంచి బయటకు కనిపించిందో యువతి చేయి.. తవ్వి చూస్తే మరో షాక్..!

ABN , First Publish Date - 2022-05-23T20:05:31+05:30 IST

అది నిర్మానుష్య ప్రాంతం. అక్కడ నుంచి తీవ్ర దుర్వసన వస్తుండటంతో స్థానిక వ్యక్తి అటువైపుగా వెళ్లాడు. అనంతరం అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకయ్యాడు. భూమిలోంచి యువతి చేయి బయటికి వొచ్చి

నిర్మానుష్య ప్రాంతంలో తీవ్ర దుర్వాసన.. భూమిలోంచి బయటకు కనిపించిందో యువతి చేయి.. తవ్వి చూస్తే మరో షాక్..!

ఇంటర్నెట్ డెస్క్: అది నిర్మానుష్య ప్రాంతం. అక్కడ నుంచి తీవ్ర దుర్వసన వస్తుండటంతో స్థానిక వ్యక్తి అటువైపుగా వెళ్లాడు. అనంతరం అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకయ్యాడు. భూమిలోంచి యువతి చేయి బయటికి వొచ్చి ఉండటంతో కంగుతిన్నాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


హర్యానా రాష్ట్రంలోని మెహమ్ పట్టణ పరిసరాల్లో ఉన్న నిర్మానుష్య ప్రాంతం నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆ వాసనకు గల కారణం కనుగునే ప్రయత్నం చేశాడు. నిర్మానుష్య ప్రాంతం వైపు వెళ్లాడు. అనంతరం భూమిలోంచి యువతి చేయి బయటికి వొచ్చి ఉండటంతో భయాందోళనలకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆ ప్రదేశాన్ని తవ్వించారు. అక్కడ అర్ధనగ్నం స్థితిలో ఉన్న యువతి మృతదేహం లభించడంతో విస్తుపోయారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.



కాగా.. ఆ యువతి ఢిల్లీకి చెందిన సంగీత అలియాస్ దివ్యగా గుర్తించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దివ్య మరణ వార్తను విని ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. దివ్య మే 11 నుంచే కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. దివ్యను ఆమెతో కలిసి నటించే ఇద్దరు వ్యక్తులే కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వారి కోసం గాలింపు ప్రారంభించారు. 


Updated Date - 2022-05-23T20:05:31+05:30 IST