వైఎస్ జగన్ డిశ్చార్జ్ పిటిషన్పై విచారణ వాయిదా
ABN , First Publish Date - 2021-12-24T03:18:22+05:30 IST
సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ ఈడీ కేసులో డిశ్చార్జ్ పిటిషన్పై విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది వాదనలు...
హైదరాబాద్: సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ ఈడీ కేసులో డిశ్చార్జ్ పిటిషన్పై విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. విజయసాయిరెడ్డి విచారణకు ఎందుకు హాజరు కాలేదని సీబీఐ కోర్టు ప్రశ్నించింది. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లినందున రాలేకపోయారని విజయసాయి న్యాయవాది తెలిపారు. దీంతో నేటి విచారణకు విజయసాయిరెడ్డి హాజరు మినహాయింపునిచ్చింది. విజయసాయిరెడ్డి పిటిషన్పై విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ఇందూ టెక్ జోన్లో డిశ్చార్జ్ పిటిషన్పై జగన్ తరపున వాదనలు వినిపించారు. దీంతో విచారణను సీబీఐ కోర్టు ఈనెల 31కి వాయిదా వేసింది.