శ్రీరాముడిది సంక్షేమ పాలన: జగన్
ABN , First Publish Date - 2021-04-22T10:40:21+05:30 IST
సత్యం, ధర్మం, న్యాయమే మార్గాలుగా సర్వమానవ సంక్షేమ పాలన సాగించిన పరమ పావన మూర్తి శ్రీరామచంద్రుడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనియాడారు.
అమరావతి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): సత్యం, ధర్మం, న్యాయమే మార్గాలుగా సర్వమానవ సంక్షేమ పాలన సాగించిన పరమ పావన మూర్తి శ్రీరామచంద్రుడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కష్టనష్టాల్లోనూ ఒకే మాట ఒకే బాటగా సాగిన జగదభిరాముడు మనకు ఆదర్శప్రాయుడని సీఎం ట్వీట్ చేశారు. పుణ్యదంపతులు సీతారాముల కల్యాణం ఈ లోకానికి పండుగ రోజని పేర్కొన్నారు.