సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్

ABN , First Publish Date - 2021-08-10T23:22:48+05:30 IST

సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్

సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్

కరీంనగర్: కేసీఆర్ పాలనలో రైతులు,నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల నాలుగింతలు నిరుద్యోగం పెరిగిందన్నారు. ఖాళీలు ఉన్నా ఉద్యోగాలు భర్తీ చెయ్యడం లేదన్నారు. దున్నపోతు మీద వాన పడ్డట్టు కేసీఆర్‌లో చలనం లేదన్నారు. కేసీఆర్ ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఉన్నాయన్నారు.


‘‘ఏడేళ్లలో ఏం సాధించాం.. ఉద్యమ ఫలాలు ఎవరు అనుభవిస్తున్నారు. చందమామ లాంటి పిల్లలు చనిపోతున్నారు అన్నది కేసీఆరే కదా. మరి ఇప్పుడు ఏమైంది. హుజురాబాద్‌లో ఎన్నికలు ఎందుకు వచ్చాయి. ఈ ఎన్నికలు ప్రజల కోసమా? వాళ్ళ బలాలు నిరూపించుకోవడం కోసమా? టీఆర్ఎస్ నేతలను నిలదీయండి. నిద్రపోయారా, గాడిదలు కాశారా అని అడగండి. ఎంత మంది చచ్చినా కేసీఆర్‌కు ఇంగిత జ్ఞానం లేదు. బీజేపీని కూడా నిలదీయండి. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏవీ. కాంగ్రెస్ ఏనాడూ సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేదు. ఎప్పుడు రేటు వస్తుందా, ఎప్పుడు అమ్ముడు పోదామా అని ఆ పార్టీ నేతలు చూస్తారు. ఉప ఎన్నిక వస్తేనే దళితులు బంధువులు అయ్యారా? ఓ పథకం ఎన్నిక కోసమే అని చెప్పే సీఎం దేశంలోనే లేదు. అందరి చేత రాజీనామాలు చేయించాలి. దళితుల భూములను లాక్కుని  లక్ష కోట్లకు అమ్ముకుంటున్నారు. దళితులకు ఇచ్చేది కేసీఆర్ డబ్బేమీ కాదు. దళితులకు కేసీఆర్ 51 లక్షలు బాకీ ఉన్నాడు. ఇప్పుడు ఇచ్చే పది లక్షలు తీసుకోండి. తర్వాత 41 లక్షలు వసూలు చేయండి. కేసీఆర్‌ను దొర అని, ఆయన కాళ్ళ దగ్గర ఉండాలి అనుకుంటారు. దళితులంతా హుజురాబాద్ రండి.. మీ ఓటు హక్కు ఇక్కడ నమోదు చేసుకోండి. ఫీల్డ్ అసిస్టెంట్లకు, చేనేత కార్మికుల భార్యలకు, నిరుద్యోగులకు, రైతులకు, తమ మద్దతు ఉంటుంది. కేసీఆర్ నిరంకుశ పాలన ప్రపంచం అంతా చూడాలి’’ అని చెప్పుకొచ్చారు. 

Updated Date - 2021-08-10T23:22:48+05:30 IST