తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సాయం ఎందుకు చెయ్యరు?: షర్మిల

ABN , First Publish Date - 2022-03-04T18:24:13+05:30 IST

సీఎం కేసీఆర్ జార్ఖండ్ పర్యటనపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ఫైర్ అయ్యారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ..

తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సాయం ఎందుకు చెయ్యరు?: షర్మిల

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ జార్ఖండ్ పర్యటనపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ఫైర్ అయ్యారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గాల్వాన్‌లో అమరులైన సైనిక కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వడం తప్పు కాదు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడంలో తప్పు లేదు. కానీ తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సాయం ఎందుకు చేయరు? 1200 మంది అమరులని ఉద్యమంలో గొంతుచించుకున్న మీకు... అధికారంలోకి వచ్చాక కొందరే అమరులెందుకయ్యారు? నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకొంటున్న వందల మంది నిరుద్యోగులను ఎందుకు ఆదుకోరు? అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న వేలమంది రైతు కుటుంబాలను ఎందుకు ఆదుకోరు? కనీసం నష్టపోయిన పంటకు పరిహారం ఎందుకివ్వరు? సొంత రాష్ట్రం వారిని అల్లం, బయటి వారిని బెల్లం చేసుకోవడమేనా బంగారు భారత్‌కు బాట?’’ అని ప్రశ్నించారు.

Updated Date - 2022-03-04T18:24:13+05:30 IST