వరి కొనని ముఖ్యమంత్రి అవసరమా..?: షర్మిల

ABN , First Publish Date - 2021-12-11T23:51:34+05:30 IST

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ దీక్ష చేసిన వైఎస్సార్ టీపీ నాయకురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా...

వరి కొనని ముఖ్యమంత్రి అవసరమా..?: షర్మిల

మెదక్‌: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ దీక్ష చేసిన వైఎస్సార్ టీపీ నాయకురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా షర్మిల దీక్షను భగ్నం చేసి అనంతరం ఆమెతో సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ ‘‘రవి కుమార్ ఆత్మహత్యకు కేసీఆర్ కారణం. వరి కొనని ముఖ్యమంత్రి అవసరమా..?. రైతు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పట్టించుకోలేదు. బంగారు తెలంగాణ అని చెప్పి బతుకు లేకుండా చేశారు. రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారు. వరి కొనమని చెబుతున్న కేసీఆర్ రైతు నేస్తం ఎలా అవుతారు.’’ అని అన్నారు. 




Updated Date - 2021-12-11T23:51:34+05:30 IST