పువ్వాడ ఒక కంత్రీ మంత్రి: YS Sharmila

ABN , First Publish Date - 2022-06-19T21:57:18+05:30 IST

మంత్రి పువ్వాడ అజయ్ వర్సెస్ వైఎఆర్‌టీపీ షర్మిల అన్నట్లు తలపడుతున్నారు. ఈ ఇద్దరు ఒకరిపై మరొకరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసుకుంటున్నారు.

పువ్వాడ ఒక కంత్రీ మంత్రి: YS Sharmila

ఖమ్మం: మంత్రి పువ్వాడ అజయ్ వర్సెస్ వైఎఆర్‌టీపీ షర్మిల అన్నట్లు తలపడుతున్నారు. ఈ ఇద్దరు ఒకరిపై మరొకరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసుకుంటున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ మంత్రి పువ్వాడపై తీవ్రమైన విమర్శలు చేశారు. ‘‘పువ్వాడ ఒక కంత్రీ మంత్రి. పువ్వాడ వైద్య కళాశాలకు ఇబ్బందని ప్రభుత్వ మెడికల్ కాలేజీని రానివ్వడం లేదు. మెడికల్ సీట్లు రూ.3 కోట్లకు అమ్ముకుంటున్నారు. వైఎస్సార్ బిడ్డకు బయ్యారంలో భాగం ఉందన్న.. ప్రచారంలో వాస్తవం లేదు’’ షర్మిల తెలిపారు. 


ఇటీవల ఖమ్మం నిర్వహించిన సభలో షర్మిల మాట్లాడుతూ పువ్వాడ అజయ్‌ కుమార్ (Minister Puvvada Ajaykumar) వేధింపులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారని వైఎస్ షర్మిల (Ys Sharmila) ఆరోపించారు. ఖమ్మం (Kammam)లో నియంత పాలన సాగుతోందని ఆమె మండిపడ్డారు. భూకబ్జాలెన్ని చేసినా పువ్వాడకు ధనదాహం తీరట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణమంత్రి మంత్రి పువ్వాడకు ఆర్టీసీ పరిస్థితేంటో అర్థంకాదలేదని ఎద్దేవాచేశారు. పోలీసులను పువ్వాడ పని వాళ్లలా వాడుకుంటున్నారని ఆరోపించారు.  ఖమ్మం ప్రజలకు మంత్రి పువ్వాడ చేసిందేమీ లేదని షర్మిల మండిపడ్డారు.


షర్మిల వ్యాఖ్యలకు పువ్వాడ ధీటు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా షర్మిలకు ఆయన సవాల్ విసిరారు. ‘షర్మిల.. నీకు దమ్ముంటే ఖమ్మంలో పోటీచేయ్‌. పాలేరులో అయినా సరే. నిన్ను ఓడించి మా టీఆర్‌ఎస్‌ సత్తా చాటుతాం. మీ అయ్య, అన్న పాలనలో జరిగిన అరాచకాలేంటో, పరిటాల రవి కళ్లలో తూటాలు పేల్చి ఎలా చంపారో, రవిని చంపిన మొద్దు శ్రీనును జైల్లో పెట్టి ఎలా చంపారో? బయ్యారం గనులను ఎలా దోచుకున్నారో ప్రజలకు తెలుసు’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. 



Updated Date - 2022-06-19T21:57:18+05:30 IST