తెలంగాణలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్ర
ABN , First Publish Date - 2022-05-29T15:39:47+05:30 IST
తెలంగాణలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్ర
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. నేడు సత్తుపల్లి మండలం సదాశివునిపేట నుంచి షర్మిల పాదయాత్ర సాగుతోంది. తుమ్మూరు క్రాస్, భీమవరం, పాత లింగపాలెం, లింగపాలెం, వేంసూర్ గ్రామాల మీదుగా షర్మిల పాదయాత్ర సాగనుంది. సాయంత్రం 5.30 గంటలకు మాట-ముచ్చట కార్యక్రమంలో మర్లపాడు గ్రామస్తులతో షర్మిల మాట్లాడనున్నారు.