పాదయాత్రకి మళ్ళీ సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల

ABN , First Publish Date - 2021-12-13T19:18:09+05:30 IST

ప్రజా ప్రస్థానం పాదయాత్రను మళ్లీ కొనసాగించేందుకు వైఎస్ షర్మిల నిర్ణయించారు.

పాదయాత్రకి మళ్ళీ సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల

హైదరాబాద్: ఎన్నికల కోడ్ ముగుస్తుండడంతో ప్రజా ప్రస్థానం పాదయాత్రను మళ్లీ కొనసాగించేందుకు వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఈ నెలాఖరున.. లేదా జనవరి మొదటి వారంలో యాత్రకు శ్రీకారం చుట్టునున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా గత నెల 10న పాదయాత్రకు బ్రేక్ పడింది. 21 రోజుల పాటు 238 కి.మీ. యాత్ర కొనసాగగా.. 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, 150 గ్రామాల ప్రజలను షర్మిల కలుసుకున్నారు. నకిరేకల్ నియోజకవర్గం కొండపాక గూడెంవద్ద యాత్రను నిలిపివేశారు. తిరిగి అక్కడినుంచే ప్రజాప్రస్థానం మొదలుపెట్టేందుకు షర్మిల టీమ్ ఏర్పాట్లు చేస్తోంది.

Updated Date - 2021-12-13T19:18:09+05:30 IST