Ys Sharmila: సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై వైఎస్ షర్మిల సెటైర్లు

ABN , First Publish Date - 2022-10-02T00:00:09+05:30 IST

సీఎం కేసీఆర్ (Cm Kcr) పెట్టబోతున్న జాతీయ పార్టీపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) స్పందించారు. ‘ఉన్న దరిద్రం చాలదన్నట్లు.. ...

Ys Sharmila: సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై వైఎస్ షర్మిల సెటైర్లు

మెదక్ (Medak): సీఎం కేసీఆర్ (Cm Kcr) పెట్టబోతున్న జాతీయ పార్టీపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ (Ys Sharmila) షర్మిల స్పందించారు. ‘ఉన్న దరిద్రం చాలదన్నట్లు.. ఇప్పుడు కేసీఆర్‌ దేశంపై పడతారట’ అని ఆమె ఎద్దేవా చేశారు.  ‘అమ్మకు అన్నం పెట్టలేనోడు.. పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడట’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజాసమస్యలు,రైతులను కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని షర్మిల మండిపడ్డారు. తెలంగాణలో ఏ వర్గాన్ని అయినా సీఎం ఆదుకున్నారా? అని ఆమె ప్రశ్నించారు. 


ఇక వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం (Praja Prasthanam) పాదయాత్ర కొల్చారం మండలంలో కొనసాగుతోంది.  మంతాయిపల్లి తండా గ్రామం వద్ద రైతును కలిసి కష్టాలు తెలుసుకున్న షర్మిల .. పొలంలో అరక దున్ని వ్యవసాయంపై భరోసా కల్పించారు. 


Updated Date - 2022-10-02T00:00:09+05:30 IST