ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా కేసీఆర్ సార్: షర్మిల

ABN , First Publish Date - 2021-11-03T00:02:19+05:30 IST

హుజూరాబాద్ ఓటమితో కేసీఆర్‌కు బాగా అయిందని వైఎస్సీర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా కేసీఆర్ సార్ అని ఆమె ఎద్దేవా చేశారు. తెలంగాణ..

ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా కేసీఆర్ సార్: షర్మిల

నల్గొండ: హుజూరాబాద్ ఓటమితో కేసీఆర్‌కు బాగా అయిందని వైఎస్సీర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా కేసీఆర్ సార్ అని ఆమె ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు ఉద్యమకారులని, బానిసలు కాదని అర్థమైందా అని విమర్శించారు. ‘‘రూ. 100 కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేక పోయారు. డబ్బుతో జనాలను కొనలేమని అర్థమైందా?. తెలంగాణలో కేసీఆర్ పతనం ప్రారంభం. హుజూరాబాద్‌తో‌నే కేసీఆర్ పతనం ప్రారంభం. అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారు. చివరికి దళితబంధు అని పెట్టినా కేసీఆర్‌ను ప్రజలు నమ్మలేదు.’’ అని షర్మిల విమర్శించారు. 

Updated Date - 2021-11-03T00:02:19+05:30 IST