హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోం: YS Sharmila

ABN , First Publish Date - 2021-07-17T21:20:33+05:30 IST

తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. రాబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదంటూ ట్విట్టర్ ద్వారా శనివారం ఆమె ప్రకటించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోం: YS Sharmila

ఇంటర్నెట్ డెస్క్(ఆంధ్రజ్యోతి): వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(వైఎస్ఆర్‌టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదంటూ ట్విట్టర్ ద్వారా శనివారం ఆమె ప్రకటించారు. ‘హుజూరాబాద్ ఎన్నికల వల్ల ఉపయోగం ఉందా?’ అంటూ ఆమె ప్రశ్నించారు. ‘‘హుజూరాబాద్ ఉప ఎన్నికల వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా?, దళితులకు మూడు ఎకరాల భూమి వస్తుందా? ఇవన్నీ చేస్తామని చెబితే అప్పుడు మేం కూడా పోటీచేస్తాం’’ అంటూ షర్మిల చెప్పారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నికలు మాత్రమేనంటూ షర్మిల అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-07-17T21:20:33+05:30 IST