నిందితులను అరెస్ట్ చేయాలి.. లేకపోతే ఇక్కడ నుంచి కదలను: షర్మిల
ABN , First Publish Date - 2022-07-06T01:31:16+05:30 IST
నిందితులను అరెస్ట్ చేయాలి.. లేకపోతే ఇక్కడ నుంచి కదలను: షర్మిల
సూర్యాపేట: జిల్లాలోని లక్కవరంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ టీపీ నేత సోమన్నపై దాడికి టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. నిరసనగా వైఎస్ విగ్రహం దగ్గర షర్మిల ధర్నా చేపట్టింది. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతవరకు లక్కవరం నుంచి వెళ్ళేది లేదని షర్మిల స్పష్టం చేసింది. దాంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.