గ‌వ‌ర్నర్‌కు వైఎస్ ష‌ర్మిల టీం లేఖ‌

ABN , First Publish Date - 2021-04-30T21:39:55+05:30 IST

గ‌వ‌ర్నర్‌ తమిళసైకు వైఎస్ ష‌ర్మిల టీం లేఖ‌ రాసింది. క‌రోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చేలా చూడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

గ‌వ‌ర్నర్‌కు వైఎస్ ష‌ర్మిల టీం లేఖ‌

హైదరాబాద్: గ‌వ‌ర్నర్‌ తమిళసైకు వైఎస్ ష‌ర్మిల టీం లేఖ‌ రాసింది. క‌రోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చేలా చూడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా షర్మిల టీ మెంబర్ ఇందిరాశోభన్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్లు దొర‌క‌ని ప‌రిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే స్థోమత పేదలకు లేదని, ఆరోగ్యశ్రీలో చేర్చితే పేద‌వారికి ఉప‌యోగకరంగా ఉంటుందన్నారు. క‌రోనాతో చ‌నిపోతున్న జ‌ర్నలిస్ట్‌ల‌కు 50 ల‌క్షల బీమా ఇవ్వాలని ఇందిరాశోభన్‌ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-04-30T21:39:55+05:30 IST