వైఎస్సార్ ఇక్కడి ఎన్నోసార్లు వచ్చారు: షర్మిల

ABN , First Publish Date - 2022-04-26T01:44:35+05:30 IST

వైఎస్సార్ ఇక్కడి ఎన్నోసార్లు వచ్చారు: షర్మిల

వైఎస్సార్ ఇక్కడి ఎన్నోసార్లు వచ్చారు: షర్మిల

భద్రాద్రి కొత్తగూడెం:  ప్రజా ప్రస్థానం పాదయాత్ర ను 800 కిలోమీటర్లు ముగించుకొని భద్రాచల లో అడుగు పెట్టామని వైఎస్ షర్మిల తెలిపారు. కోట్ల మంది తెలుగు ప్రజలకు పుణ్య స్థానం భద్రాచలమన్నారు. భద్రాచలం టౌన్ అంబేడ్కర్ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు.  ఆదివాసీలకు రాజధాని ఈ భద్రాచలమన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా భద్రాచలంకి ఎన్నో సార్లు వచ్చారని గుర్తుచేశారు. ఇదే గడ్డ నుంచి పోడు పట్టాలను పంపిణీ చేశారని తెలిపారు. అలాగే ఇదే భద్రాచలం నుంచి పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించారని ఆమె చెప్పారు. ఇదే ప్రాంతం నుంచి అటవీ హక్కుల చట్టాన్ని కూడా అమలు చేసిన మొదటి ముఖ్యమంత్రి వైఎస్సార్ అన్నారు. 2006 లో అటవీ చట్టం వచ్చాక వైఎస్సార్ ఇదే గడ్డ నుంచి 3లక్షల 30 వేల ఎకరాలకు హక్కు కల్పిస్తూ పట్టాలను వారి చేతిలో పెట్టారని ఆమె గుర్తుచేశారు. ఈ దేశం లో అత్యధికంగా లక్షల ఎకరాలకు భూములు ఇచ్చిన రికార్డ్ వైఎస్సార్ దన్నారు. 

 

Updated Date - 2022-04-26T01:44:35+05:30 IST