‘మిమ్మల్ని ఆశీర్వదించి, అభినందించడానికే నేను వచ్చా’: Vijayamma

ABN , First Publish Date - 2022-07-08T18:13:15+05:30 IST

వైఎస్‌ఆర్‌ కుటుంబానికి అండగా ఉన్న ప్రతిఒక్కరికీ వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ధన్యవాదాలు తెలిపారు.

‘మిమ్మల్ని ఆశీర్వదించి, అభినందించడానికే నేను వచ్చా’: Vijayamma

గుంటూరు: వైఎస్‌ఆర్‌ (YSR) కుటుంబానికి అండగా ఉన్న ప్రతిఒక్కరికీ వైసీపీ(YCP)గౌరవాధ్యక్షురాలు విజయమ్మ (Vijayamma)  ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ ప్లనరీ (YCP Plenary ) సమావేశాల్లో విజయమ్మ మాట్లాడుతూ... జగమంతా తన కుటుంబంలా వైఎస్‌ఆర్‌ ప్రేమించారన్నారు. ప్రజల హృదయాల్లో వైఎస్‌ఆర్‌ సజీవంగా ఉన్నారని అన్నారు. ‘‘మిమ్మల్ని ఆశీర్వదించడానికి, అభినందించడానికే నేను వచ్చా’’ అని తెలిపారు. ప్రజల దీవెన నుంచే వైసీపీ పుట్టిందని, అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. జగన్‌ (Jagan) చాలా కష్టపడితే తప్ప ఈ పరిస్థితి రాలేదని చెప్పారు. కాంగ్రెస్‌ పొమ్మనలేక పొగబెట్టిందని విమర్శించారు. విచారణ పేరుతో జైల్లో పెట్టి..ఆస్తుల్ని సీజ్‌ చేశారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్‌ బెదరలేదని తెలిపారు. ప్రజల అండతో జగన్‌ అధికారంలోకి వచ్చారని విజయమ్మ అన్నారు.


ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాల్ని కూడా చంద్రబాబు పక్కన పెట్టారని వ్యాఖ్యానించారు. ప్రజలకు గత ప్రభుత్వాలు ఏం చేశాయో చెప్పాలని ప్రశ్నించారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌ను కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారన్నారు. గత ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. జగన్‌ ప్రజానేత..అందుకే సంక్షేమ పథకాలు తెచ్చారన్నారు. యువతకు సీఎం జగన్‌ రోల్‌ మోడల్‌ అని విజయమ్మ చెప్పుకొచ్చారు. 

Updated Date - 2022-07-08T18:13:15+05:30 IST