వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్
ABN , First Publish Date - 2021-12-28T19:40:34+05:30 IST
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.
కడప: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసుకు సంబంధించి వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. లాయర్ లోకేశ్వర్రెడ్డి ద్వారా సీబీఐ ఏఎస్పీ రామ్సింగ్పై ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసులో ఇతరుల పేర్లు చెప్పాలని తనపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై ఎస్పీ, పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. లాయర్ ద్వారా పులివెందుల కోర్టుకు కృష్ణారెడ్డి తెలియజేశారు. సీబీఐకి మద్దతుగా వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు వేరే పేర్లు చెప్పాలని కృష్ణారెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారని వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి తరపు లాయర్ కోర్టుకు తెలిపారు.