AP News: కనీసం రోడ్డు కూడా వేయలేని దుస్థితి వైసీపీది: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-08-13T03:10:51+05:30 IST

Kurnool: బీజేపీ (BJP) రూ. 3లక్షల కోట్లతో రాయలసీమ‌లో హై‌వే నిర్మిస్తే.. వైసీపీ సర్కారు కనీసం రోడ్లు కూడా వేయలేకపోతుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.

AP News: కనీసం రోడ్డు కూడా వేయలేని దుస్థితి వైసీపీది: సోము వీర్రాజు

Kurnool:  బీజేపీ (BJP) రూ. 3లక్షల కోట్లతో రాయలసీమ‌లో హై‌వే నిర్మిస్తే.. వైసీపీ సర్కారు కనీసం రోడ్లు కూడా వేయలేకపోతుందని  బీజేపీ ఏపీ అధ్యక్షుడు  సోము వీర్రాజు (Somu Veerraju) విమర్శించారు. కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌లో యువ సంఘర్షణ యాత్ర రోడ్ షో ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు ప్రజలను దొచ్చుకుంటున్నాయని, కుటుంబ రాజకీయాలు చేయకుండా అభివృద్ధి రాజకీయాలు చేస్తున్న పార్టీ బీజేపీయేనని చెప్పారు. బీజేపీ నేత సత్యకుమార్  మాట్లాడుతూ సీఎం జగన్ ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలు విస్మరించారని పేర్కొన్నారు. 2.5 లక్షల ఖాళీలు భర్తీ చేసి ఏటా ఉద్యోగాలు ఇస్తానన్న జగన్ ..వలంటీర్ ఉద్యోగాలు చూపించారని తెలిపారు. ప్రధాని  మోడీ 25 లక్షల గృహాలు ఇస్తే  ఏపీలో గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం 7 లక్షల ఇల్లు మాత్రమే నిర్మించాయని చెప్పారు. మాజీమంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియో మహిళల గౌరవాన్ని భంగపరిచేలా ఉందన్నారు. ఎంపీ మాధవ్ విషయంలో సీఎం జగన్ మౌనం వీడాలన్నారు. సమావేశంలో రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T03:10:51+05:30 IST