తెలంగాణలో నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నారు-షర్మిల
ABN , First Publish Date - 2022-05-02T01:17:03+05:30 IST
తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారని వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారని వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల కోసంఎన్నో చేస్తున్నట్టు చెబుతున్నా వాస్తవానికి ఏమీ చేయడం లేదని ఆమె విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.ఉద్యమకారుడని కేసీఆర్కు అధికారం ఇస్తే ఏం చేశారు? అంటూ ఆమె ప్రశ్నించారు. స్కూటర్పై తిరిగే కేసీఆర్ ఇప్పుడు ప్రైవేట్ జెట్లో తిరుగుతున్నారు. తెలంగాణలో బడి, గుడి కన్నా మద్యం షాపులెక్కువ పెట్టి తాగుబోతుల సంఖ్యను పెంచుతున్నారని అన్నారు.కమీషన్ల కోసమే తెలంగాణలో కేసీఆర్ పాలన అంటూ వైఎస్ షర్మిల విమర్శించారు.