YSR Vardhanthi.. అటువంటి నేతను ఇంతవరకు చూడలేదు: దుట్టా రామచంద్రరావు
ABN , First Publish Date - 2022-09-02T17:03:50+05:30 IST
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి నేతను తాను ఇంత వరకు చూడలేదని దుట్టా రామచంద్రరావు అన్నారు.
కృష్ణా జిల్లా (Krishna Dist.): వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) వంటి నేతను తాను ఇంత వరకు చూడలేదని, ఆయన పలకరింపు, చేసే సూచనలు చాలా గొప్పగా ఉంటాయని వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు (Dutta Ramachandra Rao) అన్నారు. శుక్రవారం వైఎస్ వర్ధంతి సందర్భంగా కృష్ణాజిల్లా, అంపాపురంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలో పాల్గొన్న దుట్టా రామచంద్రరావు మాట్లాడుతూ వైఎస్ మరణం కాంగ్రెస్కే కాదు, ఏపీ (AP)కి తీరని అన్యాయం చేసిందన్నారు. వైఎస్తో తనకున్న అనుబంధం చాలా ప్రత్యేకమైనదని అన్నారు.
వట్టి వసంత కుమార్ (Vatti Vasantha Kumar) మాట్లాడుతూ 2004 తరువాతే ఏపీలో పేదలకు ఒక వెలుగు వచ్చిందన్నారు. డబ్బులు ఉన్న వాళ్లతో సమానంగా పేదలు చదువుకునే అవకాశం వైఎస్ కల్పించారన్నారు. ఆరోగ్య శ్రీ (Arogya Shri) ద్వారా కార్పొరేట్ వైద్యం కష్టజీవులకు అందించారని, ఇటువంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు.