Eluru కార్పొరేషన్ ఎన్నికలు : వైసీపీకి 14, టీడీపీకి ఒక్కటే

ABN , First Publish Date - 2021-07-25T18:05:13+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైసీపీ తన సత్తా చాటుకుంది...

Eluru కార్పొరేషన్ ఎన్నికలు : వైసీపీకి 14, టీడీపీకి ఒక్కటే

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైసీపీ తన సత్తా చాటుకుంది. మొత్తం 15 డివిజన్లకు గాను ఫలితాలు వెల్లడించగా.. వైసీపీ 14 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే టీడీపీ మాత్రం ఒకే ఒక్క స్థానానికే పరిమితమైంది. 37 డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఇప్పటికే వైసీపీ మూడు డివిజన్లలో ఏకగ్రీవమైంది. ఇదిలా ఉంటే.. 50 డివిజన్ నుంచి వైసీపీ అభ్యర్థి, మాజీ మేయర్ నూర్జహాన్ బేగం విజయం సాధించారు. ప్రత్యర్థిపై 570 ఓట్లు ఆధిక్యతతో గెలుపొందారు. కాగా.. రెండోసారి మేయర్ అభ్యర్ధిగా నూర్జహాన్ బేగం రేసులో ఉన్నారు. బేగం గెలుపుతో అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు ఆనందంలో మునిగితేలుతున్నారు.



Updated Date - 2021-07-25T18:05:13+05:30 IST