డబ్బివ్వలేదని లబ్ధిదారుపై YSRCP Leader దాడి
ABN , First Publish Date - 2021-10-05T12:14:58+05:30 IST
ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటికి డబ్బు డిమాండ్ చేయగా...
చిత్తూరు జిల్లా/గంగవరం : ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటికి డబ్బు డిమాండ్ చేయగా ఇవ్వకపోవడంతో వైసీపీ నాయకుడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని హామద్ అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం మేర కు.. గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీలో హామద్ సొంతస్థలంలో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడు బాబు, అతడి కుమారుడైన వలంటీర్ దిలీప్, వార్డు మెంబర్ ముగ్గురూ కలసి ఇంటి నిర్మాణం చేపట్టాలంటే తమకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోవడంతో సోమవారం సాయంత్రం వచ్చి గడ్డపార తీసుకొని తనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా.. తన మామ ఎస్ఎం.బాబు అడ్డుకున్నాడన్నారు. దీంతో ఇరువురికీ తీవ్రగాయాల య్యాయన్నారు. నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశామన్నారు. ఎస్ఐ సుధాకర్ రెడ్డిని వివరణ కోరగా.. హామద్, బాబు మధ్య వాగ్వాదం జరిగి గొడవ కు దారితీసిందన్నారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.