YSRCPకి గుడ్ బై.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి..

ABN , First Publish Date - 2022-04-29T12:11:33+05:30 IST

YSRCPకి గుడ్ బై.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి..

YSRCPకి గుడ్ బై.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి..

  • టీడీపీలో చేరిన తంబళ్లపల్లె వైసీపీ నేత కొండ్రెడ్డి
  • చంద్రబాబు సమక్షంలో పార్టీలోకి...

అన్నమయ్య జిల్లా/ములకలచెరువు : తంబళ్లపల్లె నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేత, తంబళ్లపల్లె జడ్పీటీసీ సభ్యురాలు గీత భర్త మద్దిరెడ్డి కొండ్రెడ్డి గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనతో పాటు అనుచరులు భారీగా టీడీపీలో చేరారు. చంద్రబాబునాయుడు కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. వైసీపీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడిగా కొండ్రెడ్డి ఉండగా...ఆయన భార్య తంబళ్లపల్లె మండల జడ్పీటీసీగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, కొండ్రెడ్డి మధ్య విభేదాలు నెలకొన్నాయి. తనకు వైసీపీలో జరుగుతున్న అన్యాయం, కక్ష సాధింపుల విషయమై అప్పట్లో కొండ్రెడ్డి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది.


తనపై కక్ష సాధింపులు ఎక్కువయ్యాయని కొండ్రెడ్డి పలుమార్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే ద్వారకనాధరెడ్డిపై ఆరోపణలు చేశారు. దీంతో టీడీపీలో చేరాలని నిర్ణయించుకుని పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. కొండ్రెడ్డిని కలుపుకుని ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలని చంద్రబాబు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌, చల్లా బాబురెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2022-04-29T12:11:33+05:30 IST