వైసీపీ తరఫున విజయం.. ఫలితాలకే ముందే మృతి!

ABN , First Publish Date - 2021-07-25T17:44:22+05:30 IST

ఎన్నికల ఫలితాలకు ముందే అనారోగ్యంతో మృతి చెందారు.

వైసీపీ తరఫున విజయం.. ఫలితాలకే ముందే మృతి!

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 46 డివిజన్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్యారీ బేగం ఘన విజయం సాధించారు. అయితే.. ప్యారీ ఎన్నికల ఫలితాలకు ముందే అనారోగ్యంతో మృతి చెందారు. బేగం మృతితో మళ్లీ ఈ డివిజన్‌లో ఉప ఎన్నిక జరగనుంది. కాగా.. మొత్తం 47 డివిజన్లలో వైసీపీ ఐదు డివిజన్లను కైవసం చేసుకుంది. 38, 39, 41, 42, 46 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. ఇప్పటికే మూడు డివిజన్లలో వైసీపీ ఏకగ్రీవంగా గెలిచింది. ఇప్పటి వరకూ మొత్తం 8 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.

Updated Date - 2021-07-25T17:44:22+05:30 IST