మొక్కలు నాటిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం

ABN , First Publish Date - 2021-12-21T14:46:31+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం..

మొక్కలు నాటిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం

ఏలూరు/జంగారెడ్డిగూడెం : ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భారీగా మొక్కలు నాటారు. జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజర్ వాణి ఆధ్వర్యంలో సమకూర్చిన ఈ మొక్కలను బుట్టాయగూడెం మండలం కోట నాగవరం ఆర్ అండర్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం శాంతి, కె.వరలక్ష్మి, కారం వెంకటరమణ, కె.గోపాలకృష్ణ, పంపన కృష్ణ చిట్టిబాబు తదితర స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల గురించి, మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి తెలిపారు.



Updated Date - 2021-12-21T14:46:31+05:30 IST