వైసీపీ తరఫున టీటీడీ ఉద్యోగుల ప్రచారం

ABN , First Publish Date - 2021-03-10T21:10:11+05:30 IST

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైసీపీకి మద్దతుగా కొంతమంది టీటీడీ ఉద్యోగులు బుధవారం ప్రచారం నిర్వహించారు.

వైసీపీ తరఫున టీటీడీ ఉద్యోగుల ప్రచారం

తిరుపతి: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైసీపీకి మద్దతుగా కొంతమంది టీటీడీ ఉద్యోగులు బుధవారం ప్రచారం నిర్వహించారు. టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల దగ్గర ఉన్న పోలింగ్ బూత్ వద్ద ప్రచారం చేశారు. టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉద్యోగులందరూ చూస్తుండగానే ఇవాళ ప్రచారం చేయడం పలువురిని విస్మయానికి గురి చేసింది. గతంలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. టీటీడీ క్వార్టర్స్ దగ్గర ఎన్నికల ప్రచారం చేశారు కొందరు ఉద్యోగులు. వీడియో తీసిన ఒక మీడియా సిబ్బందిపై దాడికి పాల్పడటం తీవ్ర ఆందోళనకు దారితీసింది.  

Updated Date - 2021-03-10T21:10:11+05:30 IST