మోదీ వస్తే పిరికోడి లెక్క పారిపోయావా?... KCRపై షర్మిల ఫైర్

ABN , First Publish Date - 2022-05-27T17:26:59+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాల పర్యటనపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.

మోదీ వస్తే పిరికోడి లెక్క పారిపోయావా?... KCRపై షర్మిల ఫైర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాల పర్యటనపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘ధాన్యం కొనుగోలుపై ఢిల్లీ కోటలు బద్దలు కొడుతామన్నారు. ప్రధాని మోదీని, బీజేపీని కడిగిపారేస్తాం, ఏకిపారేస్తాం అంటూ గొప్పలు చెప్పారు. స్వయంగా మోదీనే ఇక్కడకు వస్తే మీరెక్కడకు పారిపోయారు కేసీఆర్ గారు. తెలంగాణ ధాన్యం ఎందుకు కొనవు అని నిలదీయలేక పోయారా. మద్దతు ధర ఎందుకు ఇవ్వవు అని ఏకిపారేయలేక పోయావా?. పిల్లిని చూసి ఎలుక దాక్కున్నట్లు మోదీ వస్తే పిరికోడి లెక్క పారిపోయావా?. ఇంటి దాక వచ్చిన ప్రధానిని కలవడానికి మొహం చెల్లదు కానీ.. ఢిల్లీకి పోయి రాజ్యాలు ఏలుతాడట. కేసీఆర్ పాలన అవినీతి మయమని మోదీ చెప్తారు. మోదీ అవినీతి చిట్టా నా దగ్గర ఉందని కేసీఆర్ చెప్తారు. కానీ, ఇద్దరు ఎదురుపడరు, అవినీతిని బయటపెట్టరు’’ అంటూ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2022-05-27T17:26:59+05:30 IST