నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి: షర్మిల
ABN , First Publish Date - 2022-01-20T23:15:39+05:30 IST
ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని
హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. కోర్టులు మొట్టికాయలు వేస్తేగానీ కేసీఆర్కి బాధ్యతలు గుర్తు రావని ఆమె మండిపడ్డారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలనే సోయిలేదన్నారు. రైతుబంధు ఒక్కటిచ్చి పంటబీమాను కేసీఆర్ ఎత్తేశారని ఆమె ఆరోపించారు. రెండేళ్లలో లక్షల ఎకరాల్లో పంటనష్టపోతే పరిహారం కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ఇచ్చేదీ లేదు.. కేంద్రం ఇచ్చిందీ ఇవ్వరని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్కి రైతుబంధు వారోత్సవాలు చేయడమే తెలుసు కానీ రైతులకి పరిహారం ఇవ్వడం తెలియదన్నారు. రైతును ఆదుకోవడం చేతకాని సీఎం మనకొద్దని షర్మిల అన్నారు.