రైతులను ఆదుకోని దిక్కుమాలిన పాలన కేసీఆర్ ది: Sharmila

ABN , First Publish Date - 2022-04-26T19:45:32+05:30 IST

పోడు భూముల సమస్య పరిష్కరించడంలో సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ది లేదని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు.

రైతులను ఆదుకోని దిక్కుమాలిన పాలన కేసీఆర్ ది: Sharmila

భద్రాద్రి కొత్తగూడెం: పోడు భూముల సమస్య పరిష్కరించడంలో సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ది లేదని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. జిల్లాలోని బూర్గంపాడు మండలం రెడ్డిపాలెంలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా వైఎస్సార్టీపీ అధినేత్రి మాట్లాడుతూ... పట్టాలు ఇవ్వక పోగా ఉన్న వాటికి లాక్కున్నారన్నారు. రైతులు కోటీశ్వరులు అయితే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారని ప్రశ్నించారు. తప్పుడు సంతకం పెట్టి యాసంగిలో రైతులను నిండా ముంచారన్నారు. రైతులను ఆదుకోని దిక్కుమాలిన పాలన కేసీఆర్ ది అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ మోసం చేయని వర్గం లేదన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నించక పోవడం వల్లనే కేసీఆర్ అరాచకాలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని షర్మిల అన్నారు. 

Updated Date - 2022-04-26T19:45:32+05:30 IST