67వ రోజుకు వైఎస్ షర్మిల పాదయాత్ర

ABN , First Publish Date - 2022-04-26T17:01:52+05:30 IST

వైస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర 67వ రోజుకు చేరుకుంది.

67వ రోజుకు వైఎస్ షర్మిల పాదయాత్ర

భద్రాద్రి కొత్తగూడెం: వైస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర 67వ రోజుకు చేరుకుంది. మంగళవారం పినపాక నియోజక వర్గం సారపాక క్యాంప్ నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు. బూర్గంపాడు మండల పరిధిలోని  రెడ్డి పాలెం, నాగినేని ప్రోలు గ్రామాల మీదుగా బూర్గంపాడు గ్రామంకు షర్మిల చేరుకోనున్నారు. మధ్యాహ్నం12 గంటలకు బూర్గంపాడు గ్రామంలో షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలకు పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లు ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-26T17:01:52+05:30 IST