Bhadradri: 56వ రోజు షర్మిల పాదయాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2022-04-15T16:25:59+05:30 IST

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 56వ రోజుకు చేరుకుంది.

Bhadradri: 56వ రోజు షర్మిల పాదయాత్ర ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం: వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 56వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం ఇల్లందు మండలం  సుదిమళ్ల క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. జగదాంబ గుంపు, మోదుగుల గూడెం మీదుగా బొజ్జయిగుడెంకు యాత్ర చేరుకోంది. మధ్యాహ్నం 12 గంటలకు బోజ్జయిగుడెం వద్ద రైతు గోస మహాధర్నాలో షర్మిల పాల్గొననున్నారు. అనంతరం అన్నారం, రోల్లాపాడు మీదుగా టేకులపల్లి మండలానికి వైఎస్సార్టీపీ అధినేత్రి చేరుకోనున్నారు. టేకులపల్లి మండలం సాయన్న పేట, 9వ మైల్ తండా, తంగెళ్ళ తండా, వెంకటీయ తండా గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి వెంకటీయా తండా గ్రామం దాటిన తర్వాత షర్మిల నైట్ ఆల్ట్ చేయనున్నారు. 

Updated Date - 2022-04-15T16:25:59+05:30 IST