మహబూబాబాద్‌లో Sharmila నిరుద్యోగ దీక్ష ప్రారంభం

ABN , First Publish Date - 2021-08-17T16:57:25+05:30 IST

జిల్లాలోని గూడూరు మండలం గుండెంగలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష ప్రారంభించారు.

మహబూబాబాద్‌లో Sharmila నిరుద్యోగ దీక్ష ప్రారంభం

మహబూబాబాద్: జిల్లాలోని గూడూరు మండలం గుండెంగలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్  షర్మిల నిరుద్యోగ దీక్ష ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకున్న బోడ సునీల్ కుటుంబాన్ని మంగళవారం ఉదయం షర్మిల పరామర్శించారు. అంతకు ముందు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. షర్మిల చేపట్టిన దీక్షకు వైఎస్ అభిమానుల మద్దతు తెలియజేశారు. 


Updated Date - 2021-08-17T16:57:25+05:30 IST