డీజీపీని కలిసిన యుగతులసీ ఫౌండేషన్ ఛైర్మన్

ABN , First Publish Date - 2022-06-13T23:17:24+05:30 IST

గో సంరక్షణకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్న యుగతులసీ ఫౌండేషన్ సంస్ధ గోవులను కాపాడేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరింది.

డీజీపీని కలిసిన యుగతులసీ ఫౌండేషన్ ఛైర్మన్

హైదరాబాద్: గో సంరక్షణకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్న యుగతులసీ ఫౌండేషన్ సంస్ధ గోవులను కాపాడేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరింది. ఈ మేరకు ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. బక్రీద్ సందర్భంగా గో హత్యలను అరికట్టాలని వినతిపత్రంలో కోకారు. బక్రీద్ సందర్భంగా గోవులను లీగల్‌గా తరలిస్తున్నామని ఎంపీ అసదుద్దీన్ పోలీసులకు లేఖలు రాయడం దారుణమని అన్నారు. ఒక ఎంపీయే గో వధ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని అన్నారు. బహదూర్‌పుర, చెంగిచెర్ల, ముషీరాబాద్‌లలో అక్రమ స్లాటర్లు ఉన్నాయి, వెంటనే వాటిని మూసివేయించాలని ఆయన డిమాండ్ చేశారు.గోవధ నివారించి, వాటిని కాపాడేందుకు యుగతులసి ఫౌండేషన్ కట్టుబడి వుందని శివకుమార్ పేర్కొన్నారు.

Updated Date - 2022-06-13T23:17:24+05:30 IST