యవకుతిడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-07T04:02:41+05:30 IST

తన ప్రేమను ఇరుపక్షాల పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

యవకుతిడి ఆత్మహత్య
ఆత్మహత్య చేసుకున్న యువకుడు

నెల్లూరు(క్రైం), జూలై 6: తన ప్రేమను ఇరుపక్షాల పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. చెముడుగుంట బురాన్‌పూర్‌కు చెందిన మల్లికా చిన్నా కుమారుడు సతీష్‌(25) నగరంలోని వనంతోపు సెంటర్‌లో ఉన్న రెడ్డి కార్‌ వాటర్‌ సర్వీసింగ్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు. అక్కడేఉంటూ అప్పుడప్పుడు కుటుంబసభ్యుల వద్దకు వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో మాట్లాడి వెళ్లాడు. బుధవారం ఉదయం సర్వీసు సెంటర్‌లోనే ఉరివేసుకొని ఉండటాన్ని గమనించిన తోటి వర్కర్లు రాజా, రామకృష్ణలు అతని తండ్రి చిన్నాకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న తండ్రి కుమారుడు ఉరివేసుకొని ఉండటాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న వేదాయపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకు తరలించారు. ఎస్‌ఐ మరిడినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితం సతీష్‌ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడని, ఇరు పక్షాల పెద్దలు ఒప్పుకోక పోవడంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని మృతుడి తండ్రి చిన్నా పోలీసులకు తెలిపారు.

Updated Date - 2022-07-07T04:02:41+05:30 IST