ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-27T05:26:47+05:30 IST

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
వెంకటశేషయ్య మృతదేహం

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు


తోటపల్లిగూడూరు, జనవరి 26 : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా  కేసు నమోదు చేశారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు... మండలంలోని కొత్తపాళెం స్వర్ణపురి కాలనీకి చెందిన నాసిన వెంకటశేషయ్య (30) తొమ్మిదేళ్ల క్రితం ఇందుకూరుపేట ప్రాంతానికి చెందిన మమతను  ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా గత కొంత కాలం నుంచి భార్యాభర్తల మధ్య కలహాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో గోడకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. కాగా భార్య వివాహేతర సంబంధాన్ని జీర్ణించుకోలేకే వెంకటశేషయ్య ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కె.ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 


Updated Date - 2022-01-27T05:26:47+05:30 IST