AP గవర్నర్‌తో వైవీబీ రాజేంద్రప్రసాద్ భేటీ

ABN , First Publish Date - 2022-05-20T16:47:11+05:30 IST

గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌తో ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ వ్యవస్థాపక అధ్యక్షులు వై.వి.బీ. రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు.

AP గవర్నర్‌తో వైవీబీ రాజేంద్రప్రసాద్ భేటీ

విజయవాడ: గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌(Bishwabhushan Harichandan)తో ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ వ్యవస్థాపక అధ్యక్షులు వై.వి.బీ. రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల నిధులు రూ.7660 కోట్లు దొంగలించారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం 14,15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రంలోని 12918 గ్రామ పంచాయతీలకు పంపించిన నిధులు రూ.7660 కోట్లు ఇవ్వగా... రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకుందని ఆరోపించారు. ఆ డబ్బులు తిరిగి గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని గవర్నర్‌కు రాజేంద్రప్రసాద్ వినతి పత్రం అందజేశారు. 

Updated Date - 2022-05-20T16:47:11+05:30 IST