నెల్సన్ మండేలా కుమార్తె కన్నుమూత
ABN , First Publish Date - 2020-07-14T13:34:53+05:30 IST
నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా కుమార్తె జిండ్జీ మండేలా(59) సోమవారం జోహన్నె్సబర్గ్లోని ఓ ఆస్పత్రిలో మరణించారు.
జోహన్నెస్ బర్గ్, జూలై 13: నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా కుమార్తె జిండ్జీ మండేలా(59) సోమవారం జోహన్నె్సబర్గ్లోని ఓ ఆస్పత్రిలో మరణించారు. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. జిండ్జీ డెన్మార్క్లో దక్షిణాఫ్రికా రాయబారిగా పనిచేస్తున్నారు. నెల్సన్ మండేలా, రెండో భార్య విన్నీ మండేలాకు కూతురే జిండ్జీ. 1985లో జైలు నుంచి మండేలా పంపిన ప్రకటనను భారీ జనసమూహం మధ్య చదివి వినిపించడంతో జిండ్జీ అంతర్జాతీయ ప్రాచుర్యం పొందారు.