జేసీ రాజశేఖర్కు జడ్పీ ఇన్చార్జి సీఈవో బాధ్యతలు
ABN , First Publish Date - 2021-04-18T06:13:39+05:30 IST
జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవోగా జేసీ రాజశేఖర్ను నియమిస్తూ కలెక్టర్ హరినారాయణన్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 17: జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవోగా జేసీ రాజశేఖర్ను నియమిస్తూ కలెక్టర్ హరినారాయణన్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత సీఈవో ప్రభాకర్రెడ్డికి కరోనా సోకడంతో ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఇంటి నుంచి ఆయన విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఆయన తాజాగా చికిత్సకోసం ఆస్పత్రిలో చేరినట్లు కలెక్టరేట్ వర్గాలు చెప్పాయి. దీంతో జడ్పీ దైనందిన వ్యవహారాల కోసం ఇన్చార్జి సీఈవోగా జేసీ రాజశేఖర్ను కలెక్టర్ నియమించారు. ప్రభాకర్రెడ్డి తిరిగి విధుల్లో చేరేంత వరకు ఆయన అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు.