జడ్పీటీసీ మాజీ సభ్యుడి మృతి

ABN , First Publish Date - 2021-05-10T06:01:26+05:30 IST

బొబ్బర్లంకకు చెందిన జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజులపూడి హనుమంతరావు(68) ఆదివారం కరోనాతో మృతిచెందారు.

జడ్పీటీసీ  మాజీ సభ్యుడి మృతి

ఆత్రేయపురం, మే 9:బొబ్బర్లంకకు చెందిన జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజులపూడి హనుమంతరావు(68) ఆదివారం కరోనాతో మృతిచెందారు.  ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సంతాపం తెలి పారు. పలువురు నేతలు కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
 వీర్రాజు మృతికి సంతాపం
అమలాపురం టౌన్‌, మే 9: మానవ హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లాబత్తుల వీర్రాజు(48) కొవిడ్‌తో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడంపై హెచ్‌ఆర్‌ఎఫ్‌ రాష్ట్ర, జిల్లా నాయకులు ఆదివారం తీవ్ర సం తాపం తెలిపారు. ఆయన అభయ ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ వ్యవ స్థాపకుడిగా కూడా ఉన్నారు. సఖినేటిపల్లి మండలం వియ్యూ రివారిమెరక గ్రామానికి చెందిన వీర్రాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీర్రాజు చిత్రపటానికి హెచ్‌ఆర్‌ఎఫ్‌ నాయకులు పూలమాలలువేసి  నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  హెచ్‌ఆర్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్‌, రాష్ట్ర నాయకులు ఎ.రవి, నామాడి శ్రీధర్‌, యేడిద రాజేష్‌  సంతాపం తెలిపారు.
సహకార ఉద్యోగి మృతి
ఆత్రేయపురం, మే 9: వద్దిపర్రు సహకార సంఘం గుమాస్తా వి.నాగేశ్వరరావు(54) ఆదివారం కరోనాతో మృతిచెందారు. ఆయన మృతికి సహకార సంఘ ఉద్యోగులు సంతాపం తెలిపారు. నాగేశ్వరరావు చిత్రపటానికి సంఘ కార్యదర్శి ఆచంట మునీశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు  సానుభూతి తెలిపారు.
ఎస్‌జీటీ ఉపాధ్యాయుడి మృతి
అంతర్వేది, మే 9: అప్పనరామునిలంక మధ్యగ్రూపులో ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అంతర్వేదిలోపాలేనికి చెందిన చొప్పుల రత్నరాజు కరోనాతో మృతి చెంది నట్టు బంధువులు తెలిపారు.  మండలంలో కరోనా కేసులు  పెరుగుతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.  
రాయవరంలో మహిళ మృతి
రాయవరం, మే 9: రాయవరానికి చెందిన 55ఏళ్ల మహిళ కొవిడ్‌తో మృతి చెందినట్టు వైద్యాధికారిణి దేవిరాజశ్రీ ఆదివారం తెలిపారు. ఈనెల4న ఆమెకు పరీక్షలు చేయగా పాజిటివ్‌గా ఆదివారం నిర్ధారణ అయిందన్నారు. ఇంటిలో నిద్రిస్తుండగా ఆమె మృతి చెందిందని బంధువులు తెలిపారు.

Updated Date - 2021-05-10T06:01:26+05:30 IST