మహిళా దినోత్సవం రోజున జడ్పీటీసీ కన్నీరు

ABN , First Publish Date - 2021-03-09T00:02:19+05:30 IST

మహిళా దినోత్సవం రోజున ఓ జడ్పీటీసీ కన్నీరు పెడుతూ తన ఆవేదనను

మహిళా దినోత్సవం రోజున జడ్పీటీసీ కన్నీరు

పెద్దపల్లి: మహిళా దినోత్సవం రోజున ఓ జడ్పీటీసీ కన్నీరు పెడుతూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. పెద్దపల్లిలో మహిళా దినోత్సవం వేడుకలను అధికారులు నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లాలోని మహిళా జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న ధర్మారం జడ్పీటీసీ పద్మజ తనకు జరుగుతున్న అన్యాయాన్ని సభలో చెప్పారు. తాను ఏ తప్పు చేయకుండానే తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని జడ్పీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు.


సోషల్ మీడియా పోస్టులను సుమోటోగా తీసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఆమె కోరారు. మహిళా ప్రజాప్రతినిధికే ఇలా జరిగితే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని అధికారులను పద్మజ ప్రశ్నించారు. తమలాంటి మహిళలను కాపాడాలని అధికారులను జడ్పీటీసీ పద్మజ కోరారు.

Updated Date - 2021-03-09T00:02:19+05:30 IST