కేసీఆర్ బస్సు యాత్ర షురూ

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏప్రిల్ 24 నుంచి బస్సు యాత్ర షురూ చేశారు. ఈ పర్యటన మే 10 వరకు కొనసాగనుంది.

ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఒకటి, రెండు అసెంబ్లీ సెగ్మెంట్లకు వెళ్లేలా ప్లాన్‌. మొత్తం 17 రోజుల యాత్రలో 21 రోడ్‌షోలు.

మే 10న సిరిసిల్ల, సిద్దిపేటలో రోడ్‌షోలతో బస్సు యాత్ర ముగింపు.

కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తున్న కేసీఆర్.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని నిర్ణయం.

లోకసభ ఎన్నికల్లో మనుగడ చాటుకుని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని గులాబీ బాస్ ప్లాన్. 

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించగలుగుతామనే అంశాన్ని.. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం.