'మేడిగడ్డకు మరమ్మతులు చేసినా ఉంటుందనే గ్యారెంటీ లేదు'

మేడిగడ్డ బ్యారేజీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో పలు విషయాలను చర్చించారు

ఈ క్రమంలో మాట్లాడిన పొంగులేటి మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై కేబినెట్ భేటీలో చర్చించామని తెలిపారు

మేడిగడ్డకు మరమ్మతులు చేసిన ఉంటుందనే గ్యారెంటీ లేదని కమిటీ చెప్పిందని అన్నారు

ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో నీరు నిల్వ చేసే పరిస్థితి లేదని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు

తాత్కాలికంగా ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రైతులకు సాగు నీరు ఇవ్వాలని భావిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు

మేడిగడ్డ అంశంలో ఎన్‌డీఎస్ఏ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళతామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు