Share News

tdp: కేపులకుంటలో కందికుంట ప్రచారం

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:04 AM

నల్లచెరువు, ఏప్రిల్‌ 25 : మండలంలోని కేపు లకుంట, దామావాండ్లపల్లి గ్రామాల్లో గురువారం కూటమి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసద్‌ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఆయనకు ఘనస్వాగతం లభించింది.

 tdp: కేపులకుంటలో కందికుంట ప్రచారం
కేపులకుంటలో ప్రచారం చేస్తున్న కందికుంట

నల్లచెరువు, ఏప్రిల్‌ 25 : మండలంలోని కేపు లకుంట, దామావాండ్లపల్లి గ్రామాల్లో గురువారం కూటమి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసద్‌ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఆయనకు ఘనస్వాగతం లభించింది.


అడుగడుగునా మహిళలు హారతులు పట్టారు. తర్వాత కందికుంట గ్రామంలో ఇంటింటికి తిరిగి సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని కోరారు. కూటమి అధికారంలోకి వస్తే సూపర్‌సిక్స్‌ పథకాలు అమలవుతాయన్నారు. చంద్రబాబు రాష్ర్టాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తారన్నారు. అవినీతి వైసీపీని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. తొలుత నల్లచెరువు పాత రైల్వేస్టేషన నుంచి యువకులు గ్రామాల వరకు బైక్‌ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Apr 26 , 2024 | 12:04 AM