Home » Andhra Pradesh » Ananthapuram
కదిరి, ఏప్రిల్ 26 : మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్కు న్యాయవాదిగా వ్యవహరిస్తూ వైసీపీ అభ్యర్థి మక్బుల్బాషా తరఫున నామినేషన్ల పరిశీలనకు వచ్చిన ప్రసాద్రెడ్డిపై టీడీపీ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ తరఫు న్యాయవాది కే. ప్రభాకర్రెడ్డి అభ్యంతరం తెలిపారు.
ముదిగుబ్బ, ఏప్రిల్ 26: కూటమి గెలిస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ పేర్కొన్నారు. మండలంలోని టీఎన పాళ్యం, బసిరెడ్డి పల్లి, ఇరికిరెడ్డిపల్లి, గుట్టకిందపల్లి, ఆకుతోటపల్లి, మల్లేపల్లి, తప్పిటవారిపల్లి, కొండగట్టుపల్లి, మద్దన్నగారిపల్లి, ఒడ్డుకింద తండాలలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పుట్టపర్తి రూరల్, ఏప్రిల్ 26: అనుమానం పెనుభూతంగా మారడంతో భర్తచేతిలో భార్య దారుణహత్యకు గురైంది. ఈ విషాదకర ఘటన మండలంలోని వెంగళమ్మచెరువులో శుక్రవారం చోటుచేసుకుంది. పుట్టపర్తి రూరల్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన ్నాయి.
ధర్మవరం, ఏప్రిల్ 26: పట్టుచీర డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు సోదరుడిని హత్య చేయడంతో పాటు అడ్డువచ్చిన పెద్దమ్మ, మరో సోదరుడిని కత్తితో గాయపరిచాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన పట్టణంలోని గీతానగర్లో శుక్రవారం రాత్రి జరిగింది. వనటౌన పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గీతానగర్లో నివసిస్తున్న సావిత్రి మగ్గం నేసుకుంటూ పట్టుచీరలు అమ్ముతుండేది. ఆమెకు ఇద్దరు కుమారులు పెద్దమణికంఠ, చిన్నమణికంఠ(23) ఉన్నారు. కాగా సావిత్రి కొంతకాలం క్రితం ఓ పట్టుచీరను తన చెల్ల్లెలు నారాయణమ్మ కుమారుడు రమేశకు రూ.10వేలకు అమ్మింది. అతను డబ్బు ఇంతవరకు ఇవ్వలేదు. దీంతో శుక్రవారం రాత్రి సావిత్రితో పాటు పెద్దమణికంఠ, చిన్నమణికంఠ ఎదురు ఇంట్లో ఉ న్న రమేశను డబ్బులు అడిగారు. ఈ క్రమంలో వారి మధ్య మాటమాటపెరిగింది.
సార్వత్రిక ఎన్నికల తొలి అంకం దాదాపుగా ముగిసినట్లే. నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తలపడుతున్న టీడీపీ కూటమి, అధికార వైసీపీ అభ్యర్థుల నామినేషన్లన్నీ సరిగ్గానే ఉన్నట్లు రిటర్నింగ్ అధికారులు ఆమోద ముద్ర వేశారు. దీంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుంది. ఇక కదనరంగంలోకి దూకేందుకు అభ్యర్థులు సన్నద్ధమయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రచారానికి పక్షం రోజులే...
నంబులపూలకుంట, ఏప్రిల్ 26: గ డిచిన ఐదేళ్లలో అవినీతి పాలన సాగించి న వైసీపీని ప్రజలు ఈ ఎన్నికల్లో తరిమి కొట్టాలని టీడీపీ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. మండలంలోని సోమరాజకుంట, కుంట్లప ల్లి, కోటిరెడ్డివారిపల్లి, ధనియానిచెరువు, హరిజనవాడ, పాతూరు, గోవిందరాజులపల్లి, బి.కొత్తపల్లి, వంకమద్ది, పోరెడ్డివారిపల్లి గ్రామాల్లో శుక్రవారం ఆయన ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఆ యనకు ప్రజలు ఘన స్వాగతం పలికా రు. మహిళలు హారతులు పట్టారు. త ర్వాత ఆయన ఇంటింటికీ వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే తనను, ఎంపీగా బీకే పార్థ సారధని గెలిపించాలని కోరారు.
జనంలో ఇంకా మార్పు రాలేదు. కొడుకులకు దీటుగా, ఆ మాటకొస్తే.. కొడుకులకు మించి కూతుళ్లు దూసుకుపోతున్నా.. ఆమెపట్ల ఇంకా వివక్ష కొనసాగుతోంది. వారసుడు కావాలి అనే యావలో.. కూతురు అని తెలియగానే గర్భంలోనే ప్రాణం తీస్తున్నారు. లింగ నిర్ధారణ నేరమని తెలిసినా.. కాసులకు కక్కుర్తిపడి కొన్ని స్కానింగ్ సెంటర్లలో చెప్పేస్తున్నారు. భ్రూణ హత్యలకు పరోక్షంగా సహకరిస్తున్నారు. అలాంటి ఘటనే గుంతకల్లులో జరిగింది...
ఓబుళదేవరచెరువు, ఏప్రిల్ 26: వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎక్కడా అభివృద్ధి కనపడడం లేదని, ముఖ్యంగా గ్రామాల్లో అయితే ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అల్లాపల్లి పంచాయతీ పగడాలవారిపల్లి, కొక్కంటివారిపల్లి, యర్రబల్లి గ్రామాల్లో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి సూపర్సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.
రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరిగిన తొలివిడత పార్లమెంటు ఎన్నికలు పావగడలో ప్రశాంతంగా జరిగాయి. తాలూకా వ్యాప్తంగా 246 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహణకు తహసీల్దార్ సంతోష్కువమార్ ఏర్పాట్లు పూర్తి చేశారు. తాలూకాలో 1,97,458 ఓటర్లు ఉండగా 1,46,456 ఓట్లు పోలయ్యి 74 శాతం పోలింగ్ జరిగినట్లు తహసీల్దార్ తెలి యజేశారు.
జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తి అయ్యింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు అన్నీ ఆమోదం పొందడంతో ఆయా పార్టీల నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఎంపీ స్థానానికి 21 మంది నామినేషన్లు, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 136 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. షెడ్యూల్ మేరకు ఈ నెల 18నుంచి 25 వరకు అనంతపురం ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ...