temple: పాలపాటిదిన్నెలో ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:54 AM
నల్లచెరువు, ఏప్రిల్ 27: మండలంలోని పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు ఆలయంలోని మూలవిరాట్కు పలు అభిషేకాలు, అలంకరణలు చేశారు. అనంతరం అర్చనలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుని పూజలు చేయించారు.
నల్లచెరువు, ఏప్రిల్ 27: మండలంలోని పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు ఆలయంలోని మూలవిరాట్కు పలు అభిషేకాలు, అలంకరణలు చేశారు. అనంతరం అర్చనలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుని పూజలు చేయించారు.
రాట్నాలపల్లికి చెందిన భజన బృందం సంభ్యులు భజనలు చేశారు. భక్తులకు అన్నదానం జరిగింది. కదిరి పట్టణంలోని వాల్మీకి పాఠశాలల అధినేత పలవల జయరామిరెడ్డి, ఆయన కు మారులు పవనకుమార్రెడ్డి, అనిల్కుమార్రెడ్డి వెండి శఠగోపం వితరణ చేశా రు. దాతలకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు సత్కరించి, తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో కమిటీ చైౖర్మన భాస్కర్రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం...