Share News

tdp: వైసీపీ పాలనలో కానరాని అభివృద్ధి

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:06 AM

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్‌ 26: వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎక్కడా అభివృద్ధి కనపడడం లేదని, ముఖ్యంగా గ్రామాల్లో అయితే ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అల్లాపల్లి పంచాయతీ పగడాలవారిపల్లి, కొక్కంటివారిపల్లి, యర్రబల్లి గ్రామాల్లో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి సూపర్‌సిక్స్‌ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.

tdp:    వైసీపీ పాలనలో కానరాని అభివృద్ధి
ప్రచారంలో ప్రజలకు అభివాదం చేస్తున్న పల్లె సింధూర

ఎన్నికల ప్రచారంలో పల్లె సింధూరారెడ్డి

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్‌ 26: వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎక్కడా అభివృద్ధి కనపడడం లేదని, ముఖ్యంగా గ్రామాల్లో అయితే ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అల్లాపల్లి పంచాయతీ పగడాలవారిపల్లి, కొక్కంటివారిపల్లి, యర్రబల్లి గ్రామాల్లో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి సూపర్‌సిక్స్‌ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.


అనంతరం మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎక్కడా ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదన్నారు. గ్రామాల్లో అయితే చిన్న చిన్న సమస్యల్ని కూడా పరిష్కరించలేదన్నారు. కేంద్రం ఇచ్చే స్థానిక సంస్థల నిధులను సర్పంచుల ఖాతాల్లోకి వెళ్లకుండా వైసీపీ ప్రభుత్వమే ఇతర వాటికి వాడుకుందని తెలిపారు. అందుకే ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి జాడ కనబడటం లేదన్నారు. కూటమి అధికారంలోకి రాగానే గ్రామాల అభివృద్ధి చేస్తామన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో కియ లాంటి అంతర్జాతీయ పరిశ్రమ ఏర్పాటుకు తనవంతు కృషిచేయడంతోపాటు 193చెరువులు నింపుతామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బీకే పార్థసారథిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.


మరిన్ని వార్తల కోసం...


Updated Date - Apr 27 , 2024 | 01:06 AM