Share News

మరో నాలుగు రోజులు మంటలే

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:43 AM

ఆరెంజ్‌ జోన్‌లోకి చౌడేపల్లి, పుంగనూరు అత్యధికంగా ఎస్‌ఆర్‌పురంలో 42.4 డిగ్రీల నమోదు

మరో నాలుగు రోజులు మంటలే
బోసిపోయిన పుత్తూరు రోడ్డు

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 27: ఎండ, వడగాడ్పులతో జిల్లాలోని అనేక ప్రాంతాలు ఉడుకుతున్నాయి. రానున్న నాలుగు రోజులు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం చౌడేపల్లి, పుంగనూరు మండలాలు ఆరెంజ్‌ జోన్‌లోకి వెళ్లాయి. శ్రీరంగరాజపురంలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే తవణంపల్లెలో 42, చౌడేపల్లి 41.8, పుంగనూరు 41.8, గుడిపాల 41.4, నిండ్ర 41.3, విజయపురం 41.3, సోమల 40.9, సదుం 40.8, శాంతిపురం 40.4, పాలసముద్రం, చిత్తూరు, కుప్పం 40.2, ఐరాల, కార్వేటినగరం, నగరి, రొంపిచెర్లలలో 39.9 డిగ్రీలుగా నమోదైంది.

Updated Date - Apr 28 , 2024 | 01:43 AM