Home » Andhra Pradesh » Chittoor
ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వ పాలనపై తనకు అపారమైన అనుభవం, అవగాహన వున్నాయని... ప్రజలు అవకాశమిస్తే వాటిని ఉపయోగించి నియోజకవర్గ అభివృద్ధిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళడం ద్వారా వారి రుణం తీర్చుకుంటానని చెబుతున్నారు తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్.ప్రతిపక్షంలో వుండగానే ఎంపీగా నియోజకవర్గానికి విలువైన సేవలు అందించిన తాను ఈ పర్యాయం గెలిస్తే కేంద్ర, రాష్ట్రాల్లో ఏర్పడే ఎన్డీయే ప్రభుత్వాల అండతో తిరుపతిని అద్భుతంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు మాట ఇస్తున్నారాయన.
తిరుపతి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఈనెల 18 నుంచీ 25వ తేదీ వరకూ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులు కలిపి మొత్తం 227 మంది నామినేషన్లు వేయగా అందులో 50 మంది నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. మిగిలిన 177 మంది నామినేషన్లను ఆమోదించారు. ఇందులో పార్లమెంటుకు 27మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా ముగ్గురివి చెల్లుబాటు కాలేదు. మిగిలిన 24మందివీ ఓకే అయ్యాయి. అలాగే జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గానూ 200మంది అభ్యర్థులు నామినేషన్లు ఫైల్ చేయగా పరిశీలనలో 47మందివి తిరస్కరణకు గురయ్యాయి.మిగిలిన 153మంది నామినేషన్లు చెల్లుబాటవుతాయని అధికారులు ప్రకటించారు.
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్, శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రులను గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ దంపతులు శుక్రవారం సందర్శించారు.బర్డ్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాల తయారీ, అమరిక కేంద్రాన్ని పరిశీలించారు.ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, స్కానింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు.
తల మీద స్టిక్కరే ప్రస్తుత ఎన్నికల్లో జగన్ ట్రెండ్. ఎన్నికల సమయంలో కోడి కత్తులు, గులకరాళ్ల డ్రామాతో స్టిక్కర్లు వేసుకుంటూ ఆయన కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు.పులివెందులలో నామినేషన్ సందర్భంగా తన జేబులో పెన్ను ఉన్నా పక్కనే ఉన్న అవినాష్ పెన్ను తీసుకొని సంతకం పెట్టడంలో ఆంతర్యమేంటో అర్థం కావడం లేదు.తన పెన్నులో ఇంకు లేదా? లేక ఆయన పెన్ను పనిచేయదా అనేది జగన్ చెప్పాలి.మీ ఇంట్లో మంచి జరిగివుంటేనే వైసీపీకి ఓటు వేయండంటున్న జగన్ ముందు తన ఇంట్లో ఏం మంచి జరిగిందో చెప్పాలి.ఆయన ఇంట్లో ఏం మంచి జరిగిందో చెల్లెల్లే చెబుతున్నారనేది జగన్ గ్రహించాలి.
‘చిత్తూరు స్పెషల్ బ్రాంచిలోని రామకృష్ణ, దాము అనే ఇద్దరు కానిస్టేబుళ్లు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి కోసం పనిచేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి సొంతూరుకు చెందిన వీరిద్దరిపై వెంటనే చర్యలు తీసుకోండి’ అని చిత్తూరు టీడీపీ కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మా ఉరుకొస్తే చంపేస్తాం’ అంటూ పుంగనూరు మండలం మాగాండ్లపల్లెలో శుక్రవారం వైసీపీ కార్యకర్తలు బీసీవై పార్టీకి చెందిన నలుగురు నాయకులపై కర్రలతో దాడి చేశారు. బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బోడే రామచంద్రయాదవ్ కాన్వాయ్లోని వాహనం అద్దాలను ధ్వంసం చేశారు.
చిత్తూరు లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన నామినేషన్ల పరిశీలన ఘట్టం శుక్రవారంతో ముగిసింది. పార్లమెంటు స్థానానికి 56, ఏడు అసెంబ్లీ స్థానాలకు 254 నామినేషన్లు అందాయి. శుక్రవారం జరిగిన పరిశీలన ప్రక్రియ అనంతరం బరిలో మొత్తం 105 మంది అభ్యర్థులు మిగిలారు.
చిత్తూరు జిల్లాలో రోజురోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రతకు జనం బయటకు రావడానికి భయపడిపోతున్నారు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా మధ్యాహ్న సమయంలో వీధులన్నీ బోసిపోతున్నాయి
టీచర్లకు జగన్ ప్రభుత్వంలో చుక్కలు చూపించారు. ఈ ఐదేళ్లలో ఏ శాఖకూ లేని షరతులు, నిబంధనలు, అదనపు పనిభారం పెట్టి నిత్యం వేధించారు. తాజాగా యూడైస్ (విద్యార్థుల నమోదు) ప్రక్రియలో చోటు చేసుకున్న చిన్ని చిన్న తప్పులను కారణాలుగా చూపుతూ 25 మండలాల్లోని 213మంది హెచ్ఎంలకు, 26 మంది ఎంఈవోలకు డీఈవో దేవరాజు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు రిజర్వేషన్ల రద్దవుతాయని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రల పట్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ సూచించారు